గంట్ల తాతారావు సేవలు ప్రశంసనీయం
పెందుర్తి సమితి, మండల పరిషత్, జిల్లా పరిషత్ల్లో ప్రభుత్వ ఉద్యోగిగా గంట్ల తాతారావు అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర భారీ పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ కొనియాడారు. ఇటీవలే తాతారావు అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈ మేరకు మంత్రి అమర్నాధ్ తాతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.తన తండ్రి గుడివాడ గురునాధరావుతో తాతారావుకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాప్తికి తెచ్చుకున్నారు.అంతేకాకుండా ఎంతో మంది మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీడీవోల వద్ద సేవలందించి తాతారావు వారి మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా మంత్రి అమర్ ఓఎస్డీగా సేవలందిస్తున్న హరి ప్రసాదరావు తాతారావు సేవలను కొనియాడారు. పెందుర్తి మండల పరిషత్లో తమతో పాటు తాతారావు కలిసి పనిచేశారని, ఆయన గుర్తు చేసుకున్నారు. తొలుత వీరంతా తాతారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.తాతారావు సతీమణి గంట్ల ఎరుకలమ్మ, కుమారులు శివాజీ, శ్రీనుబాబు, తదితర కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు. స్థానిక యువత గంట్ల కిరణ్ బాబు, మజ్జి కోటి సునీల్, శ్రీను,దొంతల సంతోష్, మారుతి సుధీర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు